మెగా వారసుడు రామ్ చరణ్ తేజ-తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ‘రచ్చ’ సినిమా ఆడియో ఫిబ్రవరి 26న కర్నూలులో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా అందిన సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ చేతుల మీదుగా ఈ చిత్ర ఆడియోను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కర్నూలులోని ఎస్.టి.బి.బి.సి కాలేజ్ గ్రౌండ్స్ రచ్చ ఆడియో వేడుకకు వేదిక కానుంది.
ఆరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఫంక్షన్ ప్రారంభం కానుంది.
మణి శర్మ ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు అందించారని యూనిట్ సభ్యులు అంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించి ‘గ్యాంగ్ లీడర్’ 100 రోజుల వేడుక కర్నూలులోనే జరిగింది.
మళ్లీ సరిగ్గా 21 సంవత్సరాల తర్వాత మెగా కుటుంబానికి సంబంధించిన సినిమా వేడుక ఇక్కడ జరుగుతుండటంతో స్థానిక మెగా అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
ఒకే వేదికపై పవన్ స్టార్, డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ తేజ, తమన్నా లాంటి స్టార్లు వస్తుండటంతో అభిమానుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు.
ఈ మేరకు అందుకు తగిన విధంగా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి నిర్మాతలు : ఎన్వీ ప్రసాద్, పారాస్జైన్, సమర్పణ: ఆర్.బి.చౌదరి, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి.
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.